అక్షరటుడే, ఇందూరు: Nikusth Portal | దేశవ్యాప్తంగా కుష్టు వ్యాధిగ్రస్తుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్న నేపథ్యంలో గురువారం జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చారు. ‘నికుష్ట్ పోర్టల్’లో ఎలా నమోదు చేయాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లెప్రసీ ప్రోగ్రామ్ జాయింట్ డైరెక్టర్ జాన్ బాబు, డీఎంహెచ్వో రాజశ్రీ (DMHO Rajasri), లెప్రా సొసైటీ(Leprosy Society) ప్రతినిధులు స్వామి, కామేశ్వర రావు, జిల్లా న్యూక్లియస్ టీం డీఎన్ఎంవో భార్గవి (District Nucleus Team DNMO Bhargavi), పీఎంవో రూప, డీపీఎంవో చందర్ తదితరులు పాల్గొన్నారు.
