అక్షరటుడే, వెబ్డెస్క్: Saraswathi Pushkaralu | రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. గురువారం ప్రారంభమైన పుష్కరాలు మే 26 వరకు జరగనున్నాయి. గోదావరి, సరస్వతి, ప్రాణహిత(Godavari, Saraswati, Pranahita) నదుల త్రివేణి సంగమ స్థానమైన కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి పుష్కరాలు ప్రారంభించారు. సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) పుష్కర స్నానం ఆచరించారు.
Saraswathi Pushkaralu | లక్ష మంది స్నానాలు
పుష్కరాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు(Devotees) సేదదీరేందుకు చలువ పందిళ్లు వేశారు. గురువారం పుష్కరాల్లో భాగంగా దాదాపు లక్ష మంది పుణ్యస్నానాలు చేశారు. తెలంగాణ(Telangana)తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. టెంట్ సిటీని కూడా నిర్మించారు. త్రివేణి సంగమమైన కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత ఒక చోట కలుస్తాయి. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహిని ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ క్షేత్రంలో గత వందేళ్లుగా సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహిస్తున్నారు.