More
    Homeక్రైంACB Case | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సర్వేయర్​

    ACB Case | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సర్వేయర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. ముఖ్యంగా తహశీల్దార్​ కార్యాలయాల్లో (Tahsildar offices) అవినీతి యథేచ్ఛగా సాగుతోంది. ప్రజలను లంచాలు (Bribe) అడగటానికి అధికారులు ఏ మాత్రం భయపడటం లేదు. తమను ఎవరు ఏమి చేయలేరనే ధీమాతో లంచాల కోసం సామాన్యులను పట్టి పీడిస్తున్నారు. తాజాగా లంచం పేరిట వేధింపులకు పాల్పడుతున్న డిప్యూటీ సర్వేయర్ (Deputy Surveyor)​పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

    మంచిర్యాల మండల తహశీల్దార్​ కార్యాలయం (Mancherial Tahsildar Office)లో పోలం మంజుల డిప్యూటీ సర్వేయర్​గా పని చేస్తోంది. ఒక వ్యక్తి వ్యవసాయ భూమిని సర్వే చేసి, నివేదికను పై అధికారులకు పంపించడంతో పాటు ఆయనకు ఒక ప్రతి ఇవ్వడానికి ఆమె రూ.16,500 లంచం డిమాండ్​ చేసింది. దీంతో బాధితుడు నాలుగు విడతల్లో ఫోన్​ పే ద్వారా లంచం ఇచ్చాడు. అయితే మళ్లీ రూ.పది వేలు లంచం కావాలని డిమాండ్​ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల (ACB officers)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు బుధవారం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సర్వేయర్​ మంజులతో పాటు చైన్​మన్ ప్యాగా ఉదయ్ కుమార్​పై నేరపూరిత దుష్ప్రవర్తన కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

    ACB Case | లంచం అడిగితే ఫోన్ చేయండి

    ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల భరతం పడతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

    Latest articles

    TASK Training | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4,100 ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TASK Training | నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు....

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన...

    G-7 Summit | ప్రధాని నరేంద్ర మోదీకి జీ-7 ఆహ్వానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : G-7 Summit | భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి జీ–7 సదస్సుకు...

    Kamareddy | నాలుగేళ్ల కొడుకును చెరువులో తోసేసి తల్లి ఆత్మహత్య

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కొడుకును చెరువులో...

    More like this

    TASK Training | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4,100 ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TASK Training | నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు....

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన...

    G-7 Summit | ప్రధాని నరేంద్ర మోదీకి జీ-7 ఆహ్వానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : G-7 Summit | భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి జీ–7 సదస్సుకు...