అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Case | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. ముఖ్యంగా తహశీల్దార్ కార్యాలయాల్లో (Tahsildar offices) అవినీతి యథేచ్ఛగా సాగుతోంది. ప్రజలను లంచాలు (Bribe) అడగటానికి అధికారులు ఏ మాత్రం భయపడటం లేదు. తమను ఎవరు ఏమి చేయలేరనే ధీమాతో లంచాల కోసం సామాన్యులను పట్టి పీడిస్తున్నారు. తాజాగా లంచం పేరిట వేధింపులకు పాల్పడుతున్న డిప్యూటీ సర్వేయర్ (Deputy Surveyor)పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
మంచిర్యాల మండల తహశీల్దార్ కార్యాలయం (Mancherial Tahsildar Office)లో పోలం మంజుల డిప్యూటీ సర్వేయర్గా పని చేస్తోంది. ఒక వ్యక్తి వ్యవసాయ భూమిని సర్వే చేసి, నివేదికను పై అధికారులకు పంపించడంతో పాటు ఆయనకు ఒక ప్రతి ఇవ్వడానికి ఆమె రూ.16,500 లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు నాలుగు విడతల్లో ఫోన్ పే ద్వారా లంచం ఇచ్చాడు. అయితే మళ్లీ రూ.పది వేలు లంచం కావాలని డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల (ACB officers)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు బుధవారం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సర్వేయర్ మంజులతో పాటు చైన్మన్ ప్యాగా ఉదయ్ కుమార్పై నేరపూరిత దుష్ప్రవర్తన కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ACB Case | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే అవినీతి అధికారుల భరతం పడతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.