అక్షరటుడే, వెబ్డెస్క్: Delhi High Court | యాప్ ఆధారిత సేవలందిస్తున్న స్విగ్గీ, జెప్టో సంస్థలకు ఢిల్లీ హైకోర్టు Delhi High Court బుధవారం నోటీసులు notices జారీ చేసింది. దృష్టిలోపం ఉన్నవారికి కూడా మొబైల్ యాప్లను mobile apps అందుబాటులో ఉంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను petition న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
దీనిపై స్పందించాలని ఆయా సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి central government సూచించింది. యాక్సెసిబిలటీ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సచిన్ దత్తా Justice Sachin Dutta విచారించారు. కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ Union Ministry of Information Technology, స్విగ్గీ జెప్టోను Swiggy Zepto నిర్వహిస్తున్న భారతీయ సంస్థ కిరణకార్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ Kiranakart Technologies Private Limited నుంచి స్పందనలు కోరారు.
Delhi High Court | మే 28కి విచారణ వాయిదా.
దివ్యాంగలకు disabilities ఉన్న అడ్డంకులను తొలగించడానికి తాము కృషి చేస్తున్నామని స్వచ్ఛంద సంస్థ విచారణ సందర్భంగా తెలిపారు. యాప్లలో ప్రాప్యత చేయగల లక్షణాలు, ఇంటరాక్టివ్ అంశాలు, దృష్టి లోపం ఉన్నవారికి అవసరమైన ఉత్పత్తి వివరాలు లేవని ఎన్జీవో తరఫున న్యాయవాదులు సారా మరియు తహా బిన్ తస్నీమ్ Lawyers Sarah and Taha bin Tasneem వాదనలు వినిపించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ Articles 14 (సమానత్వ హక్కు), 19 (ప్రాథమిక స్వేచ్ఛ హక్కు), 21 (జీవించే హక్కు) కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులు దివ్యాంగులకు అందుబాటులో లేకుండా పోయాయని ఎన్జీవో పేర్కొంది. యాప్ ద్వారా సేవలందించే డిజిటల్ ప్లాట్ఫామ్లను digital platforms వికలాంగులకు పూర్తిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించే వికలాంగుల హక్కు చట్టం 2016 నిబంధనలను కూడా ఇది తిరస్కరించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో పిటిషన్పై petition స్పందించాలని ఆయా సంస్థలను ఆదేశించిన హైకోర్టు High Court విచారణను మే 28న విచారణకు వాయిదా వేసింది.