ePaper
More
    HomeజాతీయంDelhi | ఇంధనం నిలిపివేతపై ఢిల్లీ సర్కారు యూ టర్న్​.. వారికి ఇక ఉపశమనం

    Delhi | ఇంధనం నిలిపివేతపై ఢిల్లీ సర్కారు యూ టర్న్​.. వారికి ఇక ఉపశమనం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : కాలం చెల్లిన వాహనాల విషయంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుని, ఆ వెంటనే వెనుకడుగు వేసింది. వాటికి బంకుల్లో ఇంధనం పోయడం నిషేధించాలని (Delhi Fuel Ban) తీసుకున్న నిర్ణయంపై పున:రాలోచనలో పడింది.

    Delhi : ఆచారణ సాధ్యం కాదని..

    పాత వాహనాలను గుర్తించి వాటికి ఇంధనం నిలిపివేసే వ్యవస్థ ఇప్పట్లో ఆచరణ సాధ్యం కాదని గుర్తించింది. ఇందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్​కు (Commission for Air Quality Management ‌‌- CAQM) ఢిల్లీ సర్కారు లేఖ పంపింది. తాజా నిర్ణయంతో ఢిల్లీలో పాత వాహనాల యజమానులకు ఊరట లభించింది.

    READ ALSO  Vande Bharat Train | వందే భారత్​ ట్రైన్ జులై​ టికెట్లు మొత్తం బుక్​.. ఎక్కడో తెలుసా..

    “కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నిలిపివేయడాన్ని తక్షణమే నిలిపివేయాలి.. ఈ మేరకు కమిషన్ చర్యలు తీసుకోవాలి.. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (Automatic Number Plate Recognition – ANPR) వ్యవస్థ ఎన్సీఆర్ అందుబాటులోకి వచ్చాక తదుపరి చర్యలు తీసుకుందాం..” అని సీఏక్యూఎంకు రాసిన లేఖలో ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా రాసుకొచ్చారు.

    Delhi : కాలుష్య నియంత్రణలో భాగంగా..

    భారత్​ విశ్వనగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టిన స్థానిక సర్కారు.. కాలం చెల్లిన వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయొద్దని ఇటీవలే నిర్ణయించింది. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ బండ్లకు ఇంధనం నిలిపివేయాలనే నిర్ణయం జులై 1న అమల్లోకి వచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, ఆచరణ సాధ్యం కాకపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

    READ ALSO  India - Us trade deal | అమెరికాపై ప్ర‌తీకార సుంకాలు.. డ‌బ్ల్యూటీవోకు స‌మాచార‌మిచ్చిన ఇండియా

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....