అక్షరటుడే, వెబ్డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు మరో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్(65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. అభిషేక్ పోరెల్(19 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 30) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ ఒక్క వికెట్ కోల్పోకుండా 19 ఓవర్లలో 205 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు సాయి సుదర్శన్(61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 108 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శుభ్మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 93 నాటౌట్) సెంచరీని అందుకోలేకపోయాడు. గుజరాత్(Gujrat) ఓపెనర్ల ధాటికి ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మిచెల్ స్టార్క్(Mitchell Starc) లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఢిల్లీ ఓటమితో గుజరాత్ టైటాన్స్తో పాటు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. ఈ మూడు జట్లు ఇప్పటికే 17 పాయింట్స్ సాధించాయి. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ తమ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
ఢిల్లీ(Delhi Capitals) తమ చివరి రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇంటిదారి పడుతోంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో ఆడనుంది. ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు కాగా.. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లలో ముంబైకి మెరుగైన అవకాశాలు ఉన్నాయి.