అక్షరటుడే, డిచ్ పల్లి: Degree exams | తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) పరిధిలో డిగ్రీ పరీక్షలు (Degree exams) నాలుగో రోజు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం ఉదయం జరిగిన పరీక్షలకు 6,040 మంది విద్యార్థులకు, 5,689 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 6,377 మంది విద్యార్థులకు, 5,898 మంది హాజరైనట్టు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
