More
    HomeతెలంగాణPashamylaram | రియాక్టర్​ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

    Pashamylaram | రియాక్టర్​ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pashamylaram | సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పఠాన్​చెరు మండలం పాశమైలారం రియాక్టర్​ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్ ఇండస్ట్రీ (Sigachi Chemical Industry)లో సోమ‌వారం ఉద‌యం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రియాక్టర్​ పేలడంతో కార్మికులు సజీవ దహనం అయ్యారు. పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా అందులో నలుగురు మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో పది మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    Pashamylaram | కొనసాగుతున్న ఆపరేషన్​

    రియాక్టర్​ పేలడం (Reactor Explosion)తో పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పేలుడు దాటికి కార్మికులు దూరంగా ఎగిరి పడ్డారు. అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ (Administration Building) కూలిపోయింది. మరో భవనానికి బీటలు వారాయి. అయితే కూలిన భవనం శిథిలాల కింద ముగ్గురు ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    READ ALSO  DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    Pashamylaram | వైస్​ ప్రెసిడెంట్​ మృతి

    సిగాచి ఫ్యాక్టరీ జరిగిన పేలుడులో కార్మికులతో పాటు కంపెనీ వైస్​ ప్రెసిడెంట్(Company Vice President)​ కూడా మృతి చెందారు. వైస్ ప్రెసిడెంట్​ ఎల్​ఎన్​ గోవన్​ ప్లాంట్​లోకి రాగానే పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో భద్రతపై కమిటీ వేస్తామని మంత్రి వివేక్​ తెలిపారు.

    Latest articles

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...

    Rajasthan | వన్యప్రాణుల అవయవాల అమ్మకం.. వల పన్ని పట్టుకున్న అధికారులు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rajasthan | వన్యప్రాణుల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వాటి అవయవాలను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. తాజగా రాజస్థాన్‌లోని కోటాలో...

    More like this

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...