More
    HomeజాతీయంAhmedabad Plane Crash | విమాన ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

    Ahmedabad Plane Crash | విమాన ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న విమానం టేకాఫ్​ అయిన కొద్ది క్షణాల్లోనే బీజే మెడికల్​ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel)​ భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం 265 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఆ సంఖ్య 274కు చేరింది.

    Ahmedabad Plane Crash | 33 మంది మెడికోల మృతి

    విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది 241 మంది ప్రమాదంలో మరణించారు. ఫ్లైట్​లో నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే విమానం హాస్టల్​ భవనం(Hostel building)పై కూలడంతో అందులోని వైద్య విద్యార్థులు(Medical students) చనిపోయారు. మొదట 24 మంది చనిపోగా.. తాజాగా ఆ సంఖ్య 33 కు చేరింది. శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉన్నాయేమోనని అధికారులు గాలిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    READ ALSO  Ahmedabad Plane Crash | బతికి బయటపడతానని అనుకోలేదు.. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ రమేశ్​

    Ahmedabad Plane Crash | ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న డీజీసీఏ, ఎన్​ఏఐ

    విమాన ప్రమాదం చోటు చేసుకున్న స్థలాన్ని డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్ (​DGCA) అధికారులు పరిశీలించనున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు విమాన శకలాలు తొలగించొద్దని డీజీసీఏ ఆదేశించింది. దీంతో ఘటనా స్థలంలో శకలల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే ఎన్​ఐఏ అధికారులు(NIA officers) ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఎన్‌ఐఏ అధికారుల పరిశీలన మరో మరో మృతదేహం బయటపడింది.కుట్రకోణం ఉందనే అనుమానంతో ఎన్‌ఐఏ విచారణ చేపడుతోంది.

    Latest articles

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    Alumni Students | 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84...

    Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)...

    Gandhi Grand Daugter | మోసం కేసు.. గాంధీజి మునిమ‌న‌వ‌రాలికి ఏడేళ్ల జైలు శిక్ష‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gandhi Grand Daugter | మ‌న‌దేశంలో మ‌హ‌త్మా గాంధీని (Mahatma Gandhi) ఎంత గొప్ప‌గా...

    More like this

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    Alumni Students | 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84...

    Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)...