ePaper
More
    HomeతెలంగాణHyderabad | తండ్రిని చంపి సెకండ్​ షో సినిమాకు వెళ్లిన కూతురు

    Hyderabad | తండ్రిని చంపి సెకండ్​ షో సినిమాకు వెళ్లిన కూతురు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కన్న వారిని, కట్టుకున్న వారిని కడతేర్చడానికి కూడా ఆలోచించడం లేదు. తాత్కాలిక సుఖాలు, ఆనందాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరకు కడుపును బిడ్డలను కూడా చంపుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ కూతురు తన ప్రియుడితో కలిసి తండ్రిని చంపింది. అనంతరం సెకండ్​ షో సినిమా (Second Show Movie)కు వెళ్లొచ్చి.. మృతదేహాన్ని చెరువులో పడేసింది.

    Hyderabad | భర్త వదిలేయడంతో..

    హైదరాబాద్​(Hyderabad)లోని ముషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన తండ్రిని ఓ యువతి ప్రియుడితో కలిసి హతమార్చింది. ముషీరాబాద్ (Musheerabad)​కు చెందిన మనీషా(25)కు గతంలోనే వివాహం అయింది. అయితే ఆమె జావీద్​ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త ఆమెను వదిలేశాడు. అయినా జావీద్​తో మనీషా సంబంధం కొనసాగిస్తోంది. ఇది నచ్చని ఆమె తండ్రి వడ్లూరి లింగం(45) కూతురిని మందలించి ఇంటికి రమ్మన్నాడు. దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడని మనీషా తండ్రిపై పగ పెంచుకుంది.

    READ ALSO  Guru Purnima | గురు పూజకు వేళాయె.. రేపే గురు పౌర్ణమి

    Hyderabad | కల్లులో మత్తు మందు కలిపి..

    తన తండ్రిని చంపడానికి మనీషా ఆమె ప్రియుడు జావిద్ ​ తన తల్లితో కలిసి పథకం పన్నింది. ఇందులో భాగంగా కల్లులో మత్తు మందు కలిపి లింగంకు ఇచ్చారు. ఆయన తాగి పడుకోగానే.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం తన ప్రియుడితో కలిసి మనీషా సెకండ్​ షో సినిమాకు వెళ్లారు. సినిమా నుంచి వచ్చాక లింగం మృతదేహాన్ని ఘట్‌కేసర్‌ ఏదులాబాద్‌ చెరువు(Ghatkesar Edulabad Lake)లో పడేశారు. చెరువులో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు మనీషా ఆమె ప్రియుడు జావీద్​, తల్లి శారదను అదుపులోకి తీసుకున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు చేధించారు.

    Hyderabad | సమాజం ఎటు పోతుంది

    ఇటీవల చోటు చేసుకుంటున్న పలు ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ప్రేమ, వివాహేతర సంబంధాలతో కొందరు హత్య చేస్తున్నారు. ఇటీవల జీడిమెట్లలో ఓ పదో తరగతి బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయించిన విషయం తెలిసిందే. గద్వాల్​కు చెందిన తేజేశ్వర్​ అనే సర్వేయర్​ను ఆమె భార్య పెళ్లైన నెల రోజులకు ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఇటీవల ఓ మహిళా మద్యం మత్తులో తన ఐదు నెలల కూతురును చంపేసింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు.

    READ ALSO  Malnadu Drugs Case | డ్ర‌గ్స్ ముఠాలో పోలీసుల కుమారుల పాత్ర‌.. తాజాగా డీసీపీ కొడుకు అరెస్టు..

    Latest articles

    PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: PDSU | జిల్లాలో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ(Governor Jishnu Dev Verma) పర్యటన సందర్భంగా పీడీఎస్​యూ...

    Warangal | భర్తకు విషమిచ్చి బావ దగ్గరకు వెళ్లిపోయిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | దేశవ్యాప్తంగా భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు(Extramarital...

    Bichkunda | యువకుడి దారుణ హత్య

    అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | సమాజంలో నానాటికి నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. కారణం ఏదైనా మరొకరి ప్రాణాలు తీసేందుకు...

    Governor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Varma |జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు...

    More like this

    PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: PDSU | జిల్లాలో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ(Governor Jishnu Dev Verma) పర్యటన సందర్భంగా పీడీఎస్​యూ...

    Warangal | భర్తకు విషమిచ్చి బావ దగ్గరకు వెళ్లిపోయిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | దేశవ్యాప్తంగా భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు(Extramarital...

    Bichkunda | యువకుడి దారుణ హత్య

    అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | సమాజంలో నానాటికి నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. కారణం ఏదైనా మరొకరి ప్రాణాలు తీసేందుకు...