అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Trump) ఆహ్వానం కన్నా.. తనకు జగన్నాథుడి దర్శనమే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. శుక్రవారం ప్రధాని ఒడిశా(Odisha)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జీ7 సదస్సు(G7 Summit)కు వెళ్లిన తనను అమెరికా అధ్యక్షుడు వైట్హౌస్కు ఆహ్వానించారని తెలిపారు. డిన్నర్ చేసి వెళ్లాలని కోరారని మోదీ పేర్కొన్నారు. అయితే తాను ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు మోదీ చెప్పారు. ఒడిశా పర్యటన షెడ్యూల్లో ఉందని చెప్పానని తెలిపారు. జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడం తనకు ముఖ్యమని చెప్పారు.
