అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ మండల కేంద్రంలోని పలు కాలనీలో అంధకారం నెలకొంటోంది. అటవీ శాఖ బీట్ ఆఫీసర్ కార్యాలయం కాలనీలో (Forest Department Office Colony) నెల రోజులుగా విద్యుత్ దీపాలు వెలగడం లేదు.
దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి (Panchayat Secretary) సమాచారం అందించారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వారు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో విష పురుగులు సంచరిస్తున్నాయని, రాత్రి వేళల్లో రోడ్లపై నడిచి వెళ్లాలంటేనే భయంగా ఉందని చెబుతున్నారు. వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.