అక్షరటుడే, వెబ్డెస్క్: Cyber Fraud | సైబర్ నేరాలపై పోలీసులు police, ఆర్బీఐ, బ్యాంకులు RBI and banks ఎంత అవగాహన కల్పిస్తున్న ప్రజలు మోసపోతూనే ఉన్నారు. చదువుకున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు government employees, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు software engineers ఎక్కువగా సైబర్ నేరాలకు గురువుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ. ఈజీ మనీకి అలవాటు పడిన వారే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు Cyber criminals రెచ్చిపోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాకు Hanamkonda district చెందిన ఓ బీటెక్ విద్యార్థి B.Tech student నుంచి రూ.7.8 లక్షలు కాజేశారు.
Cyber Fraud | లాభాలు వస్తాయని చెప్పి..
హన్మకొండ జిల్లా Hanamkonda district కమలాపురం మండలం ఉప్పులపల్లి గ్రామానికి Uppulapalli village చెందిన ఓ యువకుడికి గత నెల 16న ఒక వాట్సప్ మెస్సేజ్ WhatsApp message వచ్చింది. అందులో సూచించిన విధంగా హోటల్స్కు రేటింగ్ ఇచ్చాడు. తర్వాత టెలిగ్రామ్లో Telegram ఇచ్చిన టాస్క్లు అన్ని పూర్తి చేశాడు. అనంతరం క్రిప్టో కరెన్సీలో crypto currency పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పారు. వారి మాటలు నమ్మిన యువకుడు మొదట రూ.1000 పెట్టుబడి పెట్టగా మంచి రిటర్న్స్ వచ్చినట్టు సైబర్ నేరగాళ్లు cyber criminals చూపించారు.
దీంతో విడతల వారీగా రూ.7,83,500 అందులో పెట్టాడు. ఎన్ని రోజులకీ డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులకు cyber police ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.