అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | పశ్చిమ బెంగాల్(West Bengal)లో మమతా బెనర్జీ(Mamata Banerjee) పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు.
బెంగాల్లోని అలీపుర్ దౌర్లో మోదీ గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దీదీ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ పాలన (TMC Ruling)లో బెంగాల్లో సమస్యలు, సంక్షోభాలు నెలకొన్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనలు పెరిగాయన్నారు. ఇటీవల మల్దా, ముర్షిదాబాద్, హుగ్లీ జిల్లాల్లో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన విమర్శించారు.
PM Modi | పేదల హక్కులను కాలరాస్తున్నారు..
టీఎంసీ పాలనలో పేదల హక్కులను కాలరాస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. మహిళలపై నేరాలు ఎక్కువయ్యాయని, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. బుజ్జగింపు రాజకీయాల పేరిట మమతా బెనర్జీ గూండాలకు స్వేచ్ఛనిచ్చారని ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.