అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | పోలీస్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు దారుల సమస్యలను పరిష్కరించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. కమిషనరేట్ పరిధిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారినికి పోలీసు సేవలను వినియోగించుకోవచ్చన్నారు. నగరంలోని సీపీ కార్యాయంలో (CP Office) సోమవారం పోలీస్ ప్రజావాణి (Police Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించారు.
CP Sai chaitanya | కార్యాలయానికి 28 ఫిర్యాదులు
కార్యాలయానికి వచ్చిన 28 మంది నుంచి ఫిర్యాదులను సీపీ స్వీకరించారు. ఆర్జీల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఏరియా పోలీసు అధికారులకు నేరుగా ఫోన్లు చేసి పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా, నేరుగా తనను సంప్రదించి ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రజావాణి కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.