అక్షరటుడే, న్యూఢిల్లీ: Corona virus : భారత్లో చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. శనివారం (మే31) నాటికి కొవిడ్ కేసులు దేశవ్యాప్తంగా 3 వేలు దాటాయి. ప్రస్తుతం దేశంలో 3,207 యాక్టివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళ(Kerala)లో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. తర్వాతి స్థానం( రెండో స్థానం)లో మహారాష్ట్ర ఉంది.
మహారాష్ట్ర(Maharashtra)లో శుక్రవారం ఒక్కరోజే 84 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 681 మంది కొవిడ్ బారినపడ్డారు. దేశంలోని యాక్టివ్ కేసులలో 60 శాతం కేరళ, మహారాష్ట్రలోనే ఉన్నాయి.
కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 29కి చేరుకుంది. మహారాష్ట్రలో ఆరుగురు మృతి చెందారు. కర్ణాటకలోనూ కొవిడ్ విజృంభిస్తోంది. మైసూర్(Mysore)లో శుక్రవారం 63 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఈ క్రమంలో కర్ణాటకలో కొవిడ్ మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది. మే 31న ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, తమిళనాడు(Delhi, Punjab, Gujarat, Tamil Nadu)లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ(Health Ministry) వెల్లడించింది. మిజోరంలో ఏడు నెలల తర్వాత తొలి కొవిడ్ కేసు నమోదైందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో చివరిగా గతేడాది అక్టోబర్లో 73 మందికి కొవిడ్ వైరస్ సోకింది.
Corona virus.. Covid-19 : నాలుగు కొత్త వేరియంట్స్..
దేశంలోని ఆయా రాష్ట్రాలలో నాలుగు కొత్త COVID-19 2 1.7, XFG, JN.1, NB.1.8.15 వేరియంట్ల(COVID-19 variants)ను గుర్తించారు. కాగా, ప్రస్తుత కేసులు తీవ్రంగా లేవని ICMR తెలిపింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.