అక్షరటుడే, వెబ్డెస్క్:Covid | కరోనా(Corona) మళ్లీ విజృంభిస్తోంది. వరుస కేసులు నమోదు కావడం భయపెడుతోంది.
కోవిడ్ – 19 కారణంగా గతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చాలా మంది కరోనా సోకి ఆస్పత్రుల పాలయ్యారు. తాజాగా మళ్లీ కరోనా కేసులు (Corona Cases) నమోదు అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోవడం గమనార్హం. ఒక్క ఢిల్లీ(Delhi)లోనే వంద కేసులు నమోదు అయ్యాయి.
కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా సోకిన వారిని ఇంట్లోనే క్వారంటైన్(Quarantine) చేస్తున్నారు. ప్రస్తుతం కేరళ 430 కరోనా కేసులతో టాప్ ప్లేస్ లో ఉంది. మహారాష్ట్రలో 209 కేసులు, ఢిల్లీలో 100, గుజరాత్ లో 83, కర్ణాటకలో 47 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 12 కేసులు బయటపడ్డాయి. మొత్తం నలుగురు కరోనాతో చనిపోయారు. ఇందులో కేరళకు చెందిన ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు, కర్ణాటకలో ఒకరు ఉన్నారు.
Covid | భయపడాల్సిన అవసరం లేదు..
ప్రస్తుతం కరోనా(Corona)తో భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్లకే ఇప్పుడు కరోనా ఎటాక్ అవుతుందని.. పెద్దగా ప్రభావం చూపించటం లేదని తెలిపారు. జనం భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య శాఖ(Medical Department) సూచిస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది.