అక్షరటుడే, వెబ్డెస్క్:Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్(Pakistan)పై ఇండియా అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది. శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ మిలిటరీ స్థావరాలను దెబ్బ తీసింది. ఈ క్రమంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ కలిసి వ్యూహాత్మక సమన్వయంతో పని చేయడంతో పాక్పై భారత్(Bharath) ఘన విజయం సాధించింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా త్రివిధ దళాల అధిపతులు పూర్తి సమన్వయంతో పని చేయడంతో ఇండియా పైచేయి సాధించింది. దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ(Indian Army) తాజాగా ఓ బుక్లెట్ను విడుదల చేసింది. ఆపరేషన్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ చీఫ్ ఫొటోలు ఇందులో ఉన్నాయి. మే 7 రాత్రి 1:05 గంటలకు తీసిన ఈ చిత్రంలో, భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నావికాదళ అధిపతులు కంట్రోల్ రూమ్లో ఆపరేషన్ ప్రతి దశనూ పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవలి చరిత్రలో అత్యంత ముఖ్యమైన సైనిక కార్యకలాపాలలో ఒకటైన సమయంలో భారతదేశపు మూడు సైనిక విభాగాల మధ్య వ్యూహాత్మక సమన్వయాన్ని ఈ అరుదైన చిత్రం చాటి చెబుతోంది.
Operation Sindoor | స్వయంగా పర్యవేక్షణ
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన క్రూరమైన ఉగ్ర దాడికి(Terror Attack) ప్రతీకారంగా ప్రారంభించబడిన ఆపరేషన్ సిందూర్ ద్వారా.. సరిహద్దు దాటకుండానే పాకిస్తాన్ అంతటా 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. భారత దళాలు, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను ఉపయోగించి ఈ శిబిరాలను నేలమట్టం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా హైలెవెల్ కోఆర్డినేషన్, రియల్ టైమ్ మేనేజ్మెంట్ను తాజా ఫొటోలు చూపుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడిని ప్రారంభించడానికి వివిధ ప్రాంతీయ కమాండ్ల కమాండర్లతో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే(Army Chief General Manoj Mukund Naravane), ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి(Marshal Vivek Ram Chowdhury), నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్(Navy Chief Admiral R. Hari Kumar)కలిసి పనిచేశారు. త్రివిధ దళాల అధిపతులు స్వయంగా దగ్గరుండి బలగాలకు మార్గదర్శనం చేయడం భారతదేశ సైనిక ఐక్యత, వృత్తి నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
Operation Sindoor | బుక్లెట్ విడుదల..
ఆపరేషన్ సిందూర్ పై భారత సైన్యం(Indian Army) తన సిబ్బందికి ఒక బుక్లెట్(Booklet)ను విడుదల చేసింది. ఇందులో ఉన్న ఫొటోలు ఆపరేషన్ విజయవంతం వెనుక ఉన్న ప్రణాళికలు, దళాల మధ్య సమన్వయాన్ని చూపిస్తున్నాయి. ఆర్మీ ఆపరేషన్స్ రూమ్ నుంచి ఆపరేషన్ను సైనిక ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్న ఫొటోలు కూడా ఇందులో ఉన్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్.. పాకిస్తాన్పై దాడులను స్వయంగా పర్యవేక్షిస్తున్న చిత్రాలు ఉన్నాయి.