అక్షరటుడే, కామారెడ్డి: Mla Venkata Ramana Reddy | ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే కల్యాణ మండపాల (Wedding halls) నిర్మాణాలు పూర్తి చేస్తామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాజంపేట (Rajampet) మండలం తలమడ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన జై భవానీ రూఫింగ్ ఇండస్ట్రీస్ రేకుల కంపెనీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేకుల తయారీ పరిశ్రమ కామారెడ్డి నియోజకవర్గంలో (Kamareddy Constituency) ప్రారంభించడం అభినందనీయమన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సాధ్యమైనంత తొందరగా కళ్యాణ మండపాల నిర్మాణ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు.
Mla Venkata Ramana Reddy | ‘బుర్రమత్తడి’ పనుల పరిశీలన
కామారెడ్డి పట్టణంలోని బుర్రమత్తడి కాలువలో చెత్త తొలగించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేవీఆర్ పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ కాలువలో పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగిస్తున్నారు. కాలువల్లో చెత్త ఉండకుండా చూడాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.