అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెయూ పరిధిలో దోస్త్(DOST) ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించనున్నట్లు దోస్త్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక కేటగిరీలైన పీహెచ్సీ, ఎన్సీసీ, స్పోర్ట్స్ తదితర కేటగిరీల విద్యార్థులు ఈనెల 9న తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో తెయూలోని అడ్మిషన్స్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రెండు సెట్ల జిరాక్స్ సెట్లు సైతం వెంట తీసుకురావాలని సూచించారు.
Telangana University | దోస్త్ ప్రత్యేక కేటగిరి విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన
Published on
