అక్షరటుడే, వెబ్డెస్క్: Medak | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన మారెల్లి అనిల్ (35) కాంగ్రెస్ జిల్లా ఎస్సీ కార్యదర్శి(SC Secretary)గా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఈ వ్యవహారంలో ఏపీలోని ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Medak | మొదట రోడ్డు ప్రమాదం అనుకొని..
కాంగ్రెస్ నేత అయిన అనిల్కు పెట్రోల్ బంక్ కూడా ఉంది. సోమవారం గాంధీ భవన్(Gandhi Bhavan)లో జరిగిన సమావేశానికి ఆయన వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో సోమవారం చిన్నఘనపూర్ సబ్ స్టేషన్(Chinnaghanapur Sub Station) వద్ద చనిపోయాడు. అయితే మొదట రోడ్డు ప్రమాదంలో మరణించాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అనిల్ బాడీలో బుల్లెట్లు ఉండటంతో హత్యగా గుర్తించారు. అనంతరం కారులో తనిఖీలు చేయగా.. నాలుగు బుల్లెట్ కేసులు లభ్యమయ్యాయి.
Medak | హైదరాబాద్ నుంచి వెంబడించి..
అనిల్కు ఏపీలోని ఓ ఎమ్మెల్యే(AP MLA) మనవడితో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఓ ల్యాండ్ సెటిల్మెంట్లో అనిల్ రూ.కోటి డిమాండ్ చేసినట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన బెంజ్ కారును అనిల్ లాక్కున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం గాంధీభవన్లో మీటింగ్ అనంతరం ఆయన ఓ రియల్ఎస్టేట్ ఆఫీసు(Real Estae Office)కు వెళ్లి గొడవ పడ్డట్లు తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అనిల్ను రెండు కార్లలో వెంబడిస్తూ వచ్చిన నిందితులు కాల్చి చంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.