అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్ అన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) నిర్మాణానికి మంగళవారం ముగ్గు పోశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందన్నారు. వెంటనే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ బాల్యాల రేఖ, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు దయాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు భూమయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధిరాములు, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, మద్దూరి రవి, తదితరులు పాల్గొన్నారు.
