అక్షరటుడే, వెబ్డెస్క్: Mla PA | ధర్పల్లి (Dharpalli ) మండలం మైలారం ఉన్నత పాఠశాల (Mailaram ZPHS) ఆంగ్ల ఉపాధ్యాయుడు, ఎమ్మెల్యే పీఏగా పని చేస్తున్న గడ్డం శ్రీనివాస్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మోపాల్ (Mopal) మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన గోపాల్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సదరు ఉపాధ్యాయుడు నిబంధనలకు విరుద్ధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupati Reddy) వద్ద పీఏగా కొనసాగుతున్నారని గోపాల్ ఆరోపించారు. పాఠశాలకు వెళ్లడం లేదని.. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వద్ద పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై గతంలో డీఈవోకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదన్నారు. ఈ మేరకు విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.