అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | కాంగ్రెస్ జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు జయప్రదీప్పై పిట్లం మార్కెట్ కమిటీ(Pitlam Market Committee) ఛైర్మన్ మనోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం మాగి గ్రామ (Magi Village) నాయకులు, గ్రామస్థులు మాట్లాడారు. జయప్రదీప్ ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) మంజూరు కోసం ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదన్నారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారికే ప్రస్తుతం కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో పేర్లు చేర్చారని.. నిజమైన అర్హులైన పేద లబ్ధిదారుల పేర్లను జాబితాలో చేర్చలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా మనోజ్కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కర్ణం శ్రీనివాస్, శేఖర్, సత్యనారాయణ, సాయిలు, వీరయ్య, బాలయ్య, రాజు, రాము, నారాయణ తదితరులు పాల్గొన్నారు.