అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh reddy | ఆర్మూర్ నియోజకవర్గంలో (Armoor Constituency) త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఉండబోతోందని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో మంగళవారం అధికారులతో కలిసి నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. స్థానిక తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల వద్ద భూమిని పరిశీలించారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి (CM Revanth reddy) పర్యటన ఉండబోతుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు.
Mla Rakesh reddy | పదిశాతం భూములు వదలాల్సిందే..
మున్సిపాలిటీ పరిధిలో వెంచర్లు చేసే వ్యక్తులు పదిశాతం భూమిని మున్సిపాలిటీకి ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో చేసిన వెంచర్ల విషయం తాను చెప్పట్లేదని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రజలను కొందరు రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు.
ఎమ్మెల్యేగా ఒక్కశాతం కూడా అవినీతి చేసే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి జెడ్పీ ఛైర్మన్ను (ZP Chairman) సైతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్ (RDO Raja Goud), ఏసీపీ ప్రభాకర్(ACP Prabakar), మున్సిపల్ కమిషనర్ రాజు, డిప్యూటీ తహశీల్దార్ సుజాత, బీజేపీ నాయకులు గోవింద్ పేట్ ఎంపీటీసీ రాజు, మాజీ జడ్పీటీసీ సందన్న, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, జగిర్ధార్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి