అక్షరటుడే, వెబ్డెస్క్:CM Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. శనివారం జరగనున్న నీతిఆయోగ్ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. అంతేగాకుండా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లను రేవంత్రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొంతమంది నాయకులు ఎదురు చూస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ(AICC) ఆమోదం తెలిపింది. నాలుగు మంత్రి పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్వెంకట స్వామితో పాటు బీసీ కోటాలో ఒకరికి, మైనారిటీ కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే అనంతరం పలువురు నేతలు అధిష్టానానికి లేఖలు రాయడం, తమకు మంత్రి పదవి కావాలని పట్టుబట్టడంతో విస్తరణ ఆగిపోయింది.
CM Revanth Reddy | పీసీసీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్(Bomma Mahesh Kumar Goud) ఇటీవల నిజామాబాద్లో మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెలాఖరు లేదా జూన్లో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. పదవులు తక్కువగా ఉన్నాయని, ఆశించే వారు ఎక్కువగా ఉండటంతో సమస్య వస్తోందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ సారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో చూడాలి.