అక్షరటుడే, వెబ్డెస్క్:CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ(Delhi) బయలుదేరారు. ఆయన వెంట రేవంత్ వెంట ఉత్తమ్ కుమార్రెడ్డి(Uttam Kumar Reddy), శ్రీధర్బాబు(Sridhar Babu) సైతం హస్తీనాకు పయనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకుంటామని సీఎం బుధవారం తెలిపిన విషయం తెలిసిందే. గోదావరి జలాలను అక్రమంగా తరలిస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి అవసరం అయితే సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆయన ఢిల్లీకి పయనం అయ్యారు.
CM Revanth Reddy | రెండు రోజులు ఢిల్లీలోనే..
సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) రెండు రోజులు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన టోనీ బ్లెయిర్ గ్లోబల్చేంజ్(Tony Blair Global Change) ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project)పై ఆయనకు సీఎం ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై రేవంత్, ఉత్తమ్ చర్చించనున్నారు. ఏపీ సమర్పించిన PFRపై తెలంగాణ ప్రభుత్వం తరఫున వారు వివరాలు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ పెద్దలను కలిసి పెండింగ్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.