అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth | ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal)తో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) అనంతరం రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. సుమారు గంటపాటు వీరు ఇద్దరు సమావేశం అయ్యారు. ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణం చేయడంతో వారికి ఏ శాఖలు కేయించాలనే అంశంపై చర్చించారు.
మంత్రి పదవులు దక్కని వారు ప్రస్తుతం అలకబూనారు. ఈ క్రమంలో మరో మూడు మంత్రి పదవుల భర్తీపై సైతం వారు చర్చించినట్లు సమాచారం. అలాగే పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ గురించి సీఎం కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు.