అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth | బీఆర్ఎస్ BRS అధినేత కేసీఆర్ KCRపై సీఎం రేవంత్రెడ్డి CM Revanth Reddy ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వరంగల్ Warangal లో నిర్వహించిన బీఆర్ఎస్ BRS రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ assemblyకి రాకుండా పిల్లల్ని పంపించే కేసీఆర్కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతూ.. పనిచేయకపోతే ఎలా అని నిలదీశారు.
కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుందని, కేసీఆర్ పదేళ్లు ఫౌంహౌస్కే పరిమితం అవుతారని సీఎం అన్నారు. కేసీఆర్ విద్వేషపూరిత ప్రసంగం చేసి, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తాము ఎన్నికల హామీల అమలుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
CM Revanth | బీఆర్ఎస్ సభకు సహకరించాం
ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ సభకు తాము సహకరించినట్లు సీఎం తెలిపారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకుందన్నారు. ‘తెలంగాణ ఆగమైంది.. కాంగ్రెస్ విలన్’ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు. మరో పదేళ్లు దోచుకోవడం ఆగిందని తెలంగాణ ఆగమైందా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభకు బస్సులు ఇవ్వాలని చెప్పానని.. సభకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం గుర్తు చేశారు.