More
    HomeతెలంగాణPJR Flyover | పీజేఆర్​ ఫ్లై ఓవర్​ ప్రారంభించిన సీఎం.. కంచ గచ్చిబౌలి భూములపై కీలక...

    PJR Flyover | పీజేఆర్​ ఫ్లై ఓవర్​ ప్రారంభించిన సీఎం.. కంచ గచ్చిబౌలి భూములపై కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PJR Flyover | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని కంచ గచ్చిబౌలి భూములను అభివృద్ధి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. హెచ్​సీయూ సమీపంలోని 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను చదును చేసి విక్రయించడానికి ప్రభుత్వం యత్నించగా.. హెచ్​సీయూ (HCU) విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వారికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడం, కోర్టు కూడా ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. దీంతో పనులు ఆగిపోయాయి. అయితే ఆటంకాలను అధిగమించి భూములను అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. గచ్చిబౌలి–కొండాపూర్​ మార్గంలో నిర్మించిన పీజేఆర్​ ఫ్లై ఓవర్​ (PJR Flyover)ను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

    PJR Flyover | 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి

    కంచ గచ్చిబౌలి (Kancha Gachobowli) భూములను అభివృద్ధి చేసి సంస్థలు నెలకొల్పితే ఐదు లక్షల ఉద్యోగాల వస్తాయని సీఎం తెలిపారు. అక్కడి భూముల్లో అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని.. ప్రస్తుతం అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. అయితే రాజకీయ ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను కొందరు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సీఎం విమర్శించారు. అయితే న్యాయస్థానాల్లో సైతం విజయం సాధించి కంపెనీలు నెలకొల్పి యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    READ ALSO  Kondapur Flyover | కొండాపూర్​ ఫ్లైఓవర్​కు పీజేఆర్​ పేరు.. త్వరలో ప్రారంభం

    PJR Flyover | జనతా గ్యారేజీలా పీజేఆర్​ ఇల్లు

    మాజీ మంత్రి పీ జనార్దన్​రెడ్డి (PJR) ఇల్లు ఒకప్పుడు జనతా గ్యారేజీగా ఉండేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. జంట నగరాల సమస్యల పరిష్కారం కోసం పీజేఆర్‌ కృషి చేసేవారని గుర్తు చేశారు. ఆయన కృషితోనే నగరంలోకి సురక్షిత మంచినీరు (Drinking Water) వచ్చిందని గుర్తు చేశారు. పీజేఆర్‌ నేతృత్వంలోనే హైటెక్ సిటీ (Hitech City)కి పునాది పడిందన్నారు. రాజీవ్‌ గాంధీ టెక్నాలజీ పార్క్‌ పేరును హైటెక్ సిటీగా మార్చి చంద్రబాబు అభివృద్ధి చేశారని చెప్పారు. వాజ్‌పేయీ, పీవీ వల్లే ఐటీ కారిడార్‌ అభివృద్ధి జరిగిందన్నారు.

    PJR Flyover | ఫ్లై ఓవర్​తో తప్పనున్న తిప్పలు

    గచ్చిబౌలి–కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​తో ట్రాఫిక్​ తిప్పలు తప్పనున్నాయి. రూ. 182.72 కోట్లతో దీనిని నిర్మించారు. ఓఆర్​ఆర్–కొండాపూర్ మధ్య ప్రయాణం సులభతరం కానుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది. ముఖ్యంగా గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ తగ్గనుంది.

    READ ALSO  Hydraa | చెరువులోనే సియ‌ట్ లే అవుట్​.. స్పష్టం చేసిన హైడ్రా

    Latest articles

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై...

    Himachal | భారీ వర్షాలతో వణికిపోతున్న హిమాచల్​ ప్రదేశ్​.. వరదలకు 31 మంది మృతి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himachal : ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు కుమ్మేస్తున్నాడు. కుండపోత వానలతో అల్లాడిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో...

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    More like this

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై...

    Himachal | భారీ వర్షాలతో వణికిపోతున్న హిమాచల్​ ప్రదేశ్​.. వరదలకు 31 మంది మృతి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himachal : ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు కుమ్మేస్తున్నాడు. కుండపోత వానలతో అల్లాడిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో...