అక్షరటుడే, అమరావతి: Kuppam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సీఎం చంద్రబాబు CM Chandrababu సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam constituency)లో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళను ఓ టీడీపీ కార్యకర్త చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. చిత్తూరు జిల్లా – కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది.
నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25) భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం రూ.80,000 అప్పు తీసుకున్నారు. కాగా, అప్పు తీర్చలేక భార్య శిరీష (25), తన బిడ్డలను వదిలి తిమ్మరాయప్ప గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు.
దీంతో శిరీష కూలీ పనులు చేసుకుంటూ, పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. సకాలంలో డబ్బులు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా.. మునికన్నప్ప అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఈడ్చుకొంటూ వెళ్లి తాడుతో బలవంతంగా చెట్టుకు శిరీషను కట్టేసి కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు.