అక్షరటుడే, వెబ్డెస్క్ : Congress | హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గ(Khairatabad constituency) కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు మరోసారి బయట పడింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్(MLA Danam Nagender)కు, కార్పొరేటర్ విజయరెడ్డికి(Corporator Vijaya Reddy) కొంతకాలంగా పడడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఇద్దరు నేతలు వాగ్వాదం చేసుకున్నారు.
బంజారాహిల్స్ లేక్ వ్యూలో శనివారం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ఇద్దరు వాగ్వాదం చేసుకున్నారు. దీంతో వారి అనుచరులు సైతం పోటాపోటీగా నినాదాలు చేశారు. క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని అసంతృప్తితో డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి(DCC President Rohin Reddy) అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మాజీ మంత్రి పి జనార్దన్రెడ్డి(PJR) కూతురు విజయ రెడ్డి గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు. 2022లో ఆమె రేవంత్రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన దానం నాగేందర్ ఎన్నికల్లో గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్(Congress)లో చేరడంతో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం ఇరువర్గాల నాయకులు పోటాపోటీగా నిరసనలకు దిగారు.