More
    Homeజిల్లాలుకామారెడ్డిRajiv Yuva Vikasam | ‘రాజీవ్‌ యువవికాసం’కు సిబిల్‌ తిప్పలు.

    Rajiv Yuva Vikasam | ‘రాజీవ్‌ యువవికాసం’కు సిబిల్‌ తిప్పలు.

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Rajiv Yuva Vikasam | యువతకు సబ్సిడీపై (subsidi) రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువవికాసం పథకానికి సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) అడ్డంకిగా మారుతోంది. బ్యాంకులు సైతం లబ్ధిదారుల స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో చాలామంది పథకానికి దూరం కానున్నారు. ప్రభుత్వం ఓవైపు సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) ప్రాతిపదిక కాదని చెబుతున్నా.. బ్యాంకర్లు మాత్రం దాని ఆధారంగానే రుణాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    రాజీవ్‌ యువ వికాస్‌ పథకం (Rajiv Yuva Vikas scheme) కింద ప్రభుత్వం రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు అందించనుంది. జిల్లాకు 13.450 యూనిట్లు మాత్రమే కేటాయించింది. మొత్తం 44,739 మంది దరఖాస్తు చేసుకున్నారు. రుణాల మంజూరులో సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. గతంలో బ్యాంకులు, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ల్లో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోతే సిబిల్ స్కోర్‌ cibil score పడిపోతుంది. కానీ, ఎంతోమంది వివిధ కారణాలతో రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారికి సిబిల్‌ స్కోర్‌ ఉండదు. ఈ పథకానికి వీరంతా అనర్హులు కానుండడంతో, ఆందోళన మొదలైంది. దీంతోపాటు ఇదివరకే ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు పొందినవారు కూడా అనర్హులు కానున్నారు.

    READ ALSO  Munnuru kapu Sangham | మంత్రివర్గంలో మున్నూరుకాపులకు స్థానం కల్పించాలి

    Rajiv Yuva Vikasam | మొదటి విడతలో రూ.50 వేలకే..

    రాజీవ్‌ యువ వికాస్‌ కింద ప్రభుత్వం(Government) మొదటగా రూ.50 వేల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే మంజూరు కానుంది. జిల్లాలో 1127 మంది ఈ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులను ఎంపిక చేయనున్నారు. మిగిలినవారికి విడతలవారీగా రుణాలు అందించనున్నారు.

    Rajiv Yuva Vikasam | పైరవీల కోసం ప్రదక్షిణలు..

    జిల్లాలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తమకు రుణం మంజూరవుతుందో, లేదోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే తమకు తెలిసిన నాయకుల ద్వారా పైరవీలు ప్రారంభించారు. ఎలాగైనా రుణం ఇప్పించాలని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు చోట మోటా నాయకులు పైరవీలు చేస్తూ.. కమీషన్‌ కూడా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ప్రక్రియ కొనసాగుతోంది..

    – సురేందర్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్

    READ ALSO  Wrestling Competitions | రసవత్తరంగా కుస్తీ పోటీలు

    జిల్లాలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 44,739 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం 13,450 యూనిట్లు మంజూరు చేసింది. మొదటి విడతలో 1,127 మందికి రూ.50వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తాం. బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అడుగుతున్నారని తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణాలు మంజూరవుతాయి.

    Latest articles

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూ.ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...

    AP GOVT | లక్ష మంది పేద విద్యార్థులకు JEE, NEET ఉచిత కోచింగ్ .. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది పేద మరియు సాధారణ కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా JEE, NEET...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. యూఎస్‌,...

    More like this

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూ.ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...

    AP GOVT | లక్ష మంది పేద విద్యార్థులకు JEE, NEET ఉచిత కోచింగ్ .. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది పేద మరియు సాధారణ కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా JEE, NEET...