అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ (Chemist and Druggist Association) నూతన కార్యవర్గం ఎన్నికైంది.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఫలితాలను ఆదివారం రాత్రి ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా నల్లా మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా బీర్కూర్ సుధాకర్, కోశాధికారిగా మోర సాయిలు విజయం సాధించారు. అధ్యక్షుడిగా మధుసూదన్ సమీప అభ్యర్థి సత్యప్రసాద్పై 375 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా సుధాకర్ మైసూరి 126 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కోశాధికారిగా సాయిలు 315 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు సన్మానించారు.