అక్షరటుడే, వెబ్డెస్క్: World Hypertension Day : హై బీపీ(High BP).. ఆధునిక పోటీ యుగంలో అత్యధిక మంది ఈ దీర్ఘకాలిక రుగ్మతతో బాధ పడుతున్నారు. అధిక రక్తపోటుతో సంభవిస్తున్న మరణాల సంఖ్య కూడా ఏటేటా పెరుగుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా బీపీ సమస్యలు వెంటాడుతున్నాయి. అధిక రక్తపోటుతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
నిద్రలేమి, అసంతులిత ఆహారం తదితర కారణాల వల్ల రక్తపోటు హెచ్చుతగ్గులకు గురవుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఏమేం చేయాలో ఇవి చదివేయండి.
డ్రై ఫ్రూట్స్(Dry fruits) ..
డ్రై ఫ్రూట్స్ తినడం అధిక రక్తపోటు నియంత్రణకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండిన పండ్లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు(omega-3 fatty acids) ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే, కచ్చితంగా డ్రై ఫ్రూట్స్ను చేర్చుకోండి. ప్రతి రోజూ ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం, వాల్నట్స్ తినడం మంచిది.
తాజా కూరగాయలు(Fresh vegetables)
రోజూ తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలను చేర్చుకోవాలి. మీకు అధిక రక్తపోటు(high blood pressure) ఉంటే కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. అయితే, ఆహారంలో ఉప్పు వినియోగం చాలా వరకు తగ్గించాలి. స్వల్పంగా మాత్రమే వినియోగించాలి. హై బీపీ ఉన్నవారికి గ్రేవీ కూరగాయలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి.
పండ్లు (fruits)..
అధిక రక్తపోటుతో బాధ పడుతుంటే కచ్చితంగా పండ్లు తీసుకోవాలి. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు(vitamins, minerals, antioxidants) అత్యధికంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. పండ్లు తినడం ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. అయితే, అధిక తీపి పండ్లకు దూరంగా ఉండడం ఉత్తమం. వీటిని తీసుకుంటే చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది సహజంగానే బీపీని ప్రేరేపిస్తుంది.
బార్లీ పిండి(Barley flour)
హై బీపీ బాధితులకు బార్లీ పిండి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక రకప్తోటు ఉంటే కచ్చితంగా మీ ఆహారంలో బార్లీ పిండిని చేర్చుకోండి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ బార్లీ పిండితో తయారు చేసిన రోటీలను తీసుకుంటే అది శరీరంలో పేరుకుపోయిన మురికిని కూడా తొలగిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
వీటికి దూరంగా ఉండండి(Stay away from these)
అధిక రక్తపోటు బాధితులు చాలా తక్కువ పరిమాణంలో ఉప్పు తీసుకోవాలి. అధిక సోడియం(High sodium) రక్తపోటును పెంచుతుంది. మిర్చీలు, వేయించిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్(Chillies, fried food, fast food)కు దూరంగా ఉండాలి. అధిక రక్తపోటు ఉన్న రోగులు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. అలాగే, అతిగా తినడం మానుకోవాలి. సాయంత్రం 6-7 గంటల సమయంలోనే రాత్రి భోజనం పూర్తి చేయాలి. తద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.