ePaper
More
    HomeజాతీయంUPS | కేంద్రం కీలక నిర్ణయం.. యూపీఎస్​ ఖాతాదారులకు పన్ను ప్రయోజనాల్లో మార్పులు..!

    UPS | కేంద్రం కీలక నిర్ణయం.. యూపీఎస్​ ఖాతాదారులకు పన్ను ప్రయోజనాల్లో మార్పులు..!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: UPS : ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్​) Unified Pension Scheme (UPS) ప్రోత్సహించేందుకు తాజాగా కేంద్ర సర్కారు శ్రీకారం చుట్టింది. జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్​పీఎస్​) కింద ఉన్న వారితో సమానంగా ‘యూపీఎస్’ను ఎంచుకునే వారికి కూడా పన్ను ప్రయోజనాలు అందించాలని నిర్ణయించింది.

    UPS : నిర్మలా సీతారామన్​ ఏమన్నారంటే..

    ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించాం.. వారి పదవీ విరమణ భద్రతను బలోపేతం చేయనున్నాం. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు పన్ను చట్రంలోకి ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) చేర్చాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు పారదర్శకమైన, సౌకర్యవంతమైన, సమర్థవంతమైన పన్ను విధానాలను ఎంచుకోవచ్చు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు.

    READ ALSO  Snakes | పదేళ్ల బాలిక మెడలో రెండు కట్లపాములు.. రాత్రంతా అలాగే నిద్ర!

    UPS : మొదట వారికే..

    కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 24, 2025న నోటిఫికేషన్ జారీ చేసింది. ఏమంటే.. సివిల్ సర్వీస్​లకు ఎంపికైన వారికి ఎన్​పీఎస్​ కింద ఒక ఆప్షన్​గా యూపీఎస్​ను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. కానీ, ఎన్​పీఎస్​ కింద ఉన్న ఉద్యోగులు.. యూపీఎస్​లోకి మారాలంటే వన్​-టైమ్ ఆప్షన్ మాత్రమే ఉండడం గమనార్హం.

    పెన్షన్ ఫండ్​ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ (పీఎఫ్​ఆర్​డీఏ) Pension Fund Regulatory and Development Authority (PFRDA).. దీనిని అమలు చేయడానికి మార్చి 19, 2025న ఎన్​పీఎస్​ కింద యూపీఎస్​ నిర్వహణ నిబంధనలను నోటిఫై చేసింది. జనవరి 1, 2004న అమల్లోకి వచ్చిన ఎన్​పీఎస్​ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే యూపీఎస్ ఆప్షన్​​ వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిని 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకునే అవకాశం ఉంది.

    READ ALSO  Delhi | ఇంధనం నిలిపివేతపై ఢిల్లీ సర్కారు యూ టర్న్​.. వారికి ఇక ఉపశమనం

    UPS : గతేడాది నిర్ణయం..

    జనవరి, 2004 నుంచి పాత పెన్షన్ పథకం (ఓపీఎస్​) old pension scheme (OPS) నిలిపివేయబడింది. దీని​ కింద ఉన్న ఉద్యోగులు వారు చివరగా పొందే మూలవేతనంలో 50 శాతం పెన్షన్​గా అందుకునేవారు. కాగా, ఆగస్టు 24, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశంలో యూపీఎస్​ పథకం ఆమోదం పొందింది.

    Latest articles

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    Operation Sindoor | రాఫెల్ జెట్ల కూల్చివేతపై పాక్ ఆరోపణలు అవాస్తవం.. స్పష్టం చేసిన డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాకిస్తాన్...

    More like this

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...