అక్షరటుడే, వెబ్డెస్క్ : CBSE Results | విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సీబీఎస్ఈ ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను మంగళవారం ఉదయం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. cbse.gov.in, https://cbseresults.nic.in/ వెబ్సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది.
12వ తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 16,92,794 మంది విద్యార్థులు హాజరు కాగా.. 14,96,307 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన పదో తరగతి ఫలితాలపై మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. పదో తరగతి పరీఓలు 24.12 లక్షల మంది రాశారు. వీరంతా ఫలితాల కోసం చూస్తున్నారు. త్వరలోనే పదో తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.