అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Sindhu : ఇజ్రాయెల్(Israel) – ఇరాన్(Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం (central government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్లో చిక్కుకున్న ఇండియన్స్ ను తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సింధు (Operation Sindhu) చేపట్టిన కేంద్ర సర్కారు.. ఇజ్రాయెల్లో ఉన్నవారిని కూడా భారత్కు తీసుకురావాలని నిర్ణయించింది.
కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్లో చిక్కుకున్న ఇండియన్స్ ను తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సింధు (Operation Sindhu) చేపట్టిన కేంద్ర సర్కారు.. ఇజ్రాయెల్లో ఉన్నవారిని కూడా భారత్కు తీసుకురావాలని నిర్ణయించింది.
ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిణామాల దృష్ట్యా భారత్కు తిరిగొచ్చేయాలని అనుకునేవారిని తరలించేందుకు టెల్అవీవ్ (Tel Aviv) లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ (Union Ministry of External Affairs) వెల్లడించింది. ఇందుకోసం ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరులు https://www. indembassyisrael. gov.in/indian_national reg సైట్స్ లో నమోదు చేసుకోవాలని కోరింది.
సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ (control room) నంబర్లను( +972 54-7520711, +972 54-3278392) సంప్రదించాలని, లేదంటే email: cons1.telaviv@mea. gov. in కు మెయిల్ చెయ్యాలని సూచించింది.