ePaper
More
    HomeజాతీయంHelmets | నాసిరకం హెల్మెట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

    Helmets | నాసిరకం హెల్మెట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Helmets : ద్విచక్ర వాహనాల శిరస్త్రాణాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా హెల్మెట్లు తయారు చేసే సంస్థలు, అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్​(Bureau of Indian Standards – BIS) ఆమోదం పొందిన హెల్మెట్లనే వినియోగించాలని వాహనదారులకు సూచించింది.

    Helmets : దేశంలో 21 కోట్ల బైక్స్…

    భారత్​లో సుమారు 21 కోట్ల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారుల భద్రతే ముఖ్యమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం Union Consumer Affairs Ministry వెల్లడించింది. మోటారు, వాహనాల చట్టం-1998 (Motor Vehicles Act-1998) ప్రకారం హెల్మెట్‌ను కచ్చితంగా వాడాలని స్పష్టం చేసింది.

    READ ALSO  Tamil Nadu | తమిళనాడులో విషాదం.. స్కూల్​ బస్సును ఢీకొన్న రైలు

    కాగా, నాసిరకం హెల్మెట్ల వల్ల ద్విచక్ర వాహనదారుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో BIS అనుమతి శిరస్త్రాణాల కారణంగానే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పరిశోధనలో వెల్లడైంది.

    Helmets : 9 తయారీ సంస్థల లైసెన్సులు రద్దు

    దేశంలో గత నెల (జూన్ 2025)​ నాటికి 176 తయారీ సంస్థలు BIS సర్టిఫికెట్​ పొందాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 500 హెల్మెట్​ శాంపిళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్​(BIS) టెస్ట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 2,500 నాసిరకం హెల్మెట్లను గుర్తించి సీజ్​ చేసింది. 9 కంపెనీల లైసెన్సులు రద్దు చేసింది.

    Helmets : కఠిన చర్యలు..

    కొత్తగా స్కూటర్, బైక్ కొనుగోలు చేసేవారికి సంబంధిత డీలరు రెండు హెల్మెట్‌లను అందించేలా కేంద్రం ఇటీవలే నిబంధనలు రూపొందించింది. దేశంలో ఏటా సుమారు ఐదు లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించాలనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

    READ ALSO  Rahul Gandhi | దేశ నేర రాజ‌ధానిగా బీహార్.. బీజేపీ, నితీశ్‌ల‌పై రాహుల్‌గాంధీ ఫైర్‌

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...