అక్షరటుడే, వెబ్డెస్క్: Jammu Railway Division | కేంద్ర ప్రభుత్వం (central government) జమ్మూకశ్మీర్ అభివృద్ధికి పలు చర్యలు చేపడుతోంది. పర్యాటకంగా డెవలప్ చేయడంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. అంతేగాకుండా జమ్మూ రైల్వే డివిజన్ను (Jammu Railway Division) సైతం ఏర్పాటు చేసింది. గతంలో జమ్మూ ఉత్తర రైల్వే జోన్ (Northern Railway Zone) కింద ఉండేది. నూతన రైల్వే డివిజన్ను ఏర్పాటు చేస్తూ మే 29న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇది జూన్ 1 నుంచి అమలులోకి వచ్చింది. కాగా భారత రైల్వో 70 వ డివిజన్ కావడం గమనార్హం.
Jammu Railway Division | జనవరిలో ప్రారంభించిన ప్రధాని
కొత్త డివిజన్ గణనీయమైన ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంది. ఫిరోజ్పూర్ డివిజన్ (Ferozepur Division) నుంచి జమ్మూ డివిజన్కు పలు ప్రాంతాలను బదిలీ చేశారు. జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) జమ్మూ రైల్వే డివిజన్ను ప్రారంభించారు. కొత్త డివిజన్లో పఠాన్కోట్–జమ్మూ– అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్–శ్రీనగర్–బారాముల్లా (423 కి.మీ), భోగ్పూర్ సిర్వాల్–పఠాన్కోట్ (87 కి.మీ), బటాలా–పఠాన్కోట్ (68 కి.మీ) మరియు పఠాన్కోట్–జోగిందర్ నగర్ నారో గేజ్ సెక్షన్ (164 కి.మీ)లు ఉన్నాయి.
Jammu Railway Division | రక్షణ ప్రయోజనాలకు ముఖ్యం
జమ్మూ డివిజన్ మొదటి DRM వివేక్ కుమార్ (Jammu Division First DRM Vivek Kumar) మాట్లాడుతూ ఈ డివిజన్ ఏర్పాటు కాశ్మీర్తో అనుసంధానానికి ఎంతో దోహద పడుతుందన్నారు. అంతేగాకుండా రక్షణ ప్రయోజనాలకు కూడా ముఖ్యమైనదని పేర్కొన్నారు.