More
    HomeజాతీయంCensus | జనగణనపై గెజిట్​ విడుదల చేసిన కేంద్రం

    Census | జనగణనపై గెజిట్​ విడుదల చేసిన కేంద్రం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Census | కేంద్ర ప్రభుత్వం(Central Government) ఎట్టకేలకు జనగణనపై గెజిట్​ విడుదల చేసింది. 2027 మార్చి 31 వరకు భారతదేశ జనాభా గణనను పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎన్నో సార్లు వాయిదా పడుతూ వస్తున్న జనగణన(Census)పై సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    దేశంలో 2011లో ఆఖరు సారి జనగణన చేపట్టారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కించాలి. కానీ 2021లో కరోనా(Corona) కారణంగా జనాభా లెక్కలను వాయిదా వేశారు. అయితే అనంతరం పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌(Gazette notification) విడుదలైంది.

    Census | 16వ జన గణన

    దేశంలో రెండు దశల్లో జనగణన చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ మొత్తంగా 16వది కాగా, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జనగణన. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir), లద్దాఖ్‌(Ladakh), ఉత్తరాఖండ్‌(Uttarakhand), హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh)లో ఈ ఏడాది అక్టోబర్​ 1 నాటికి జనగణన పూర్తి చేస్తారు. మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణనను చేపట్టనున్నారు.

    READ ALSO  India Population | జనాభాలో చైనాను దాటేసిన భారత్

    జన గణనపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. జనాభా లెక్కల కోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్​ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. డిజిటల్ రూపంలోనే ట్యాబ్​ల ద్వారా జనాభా లెక్కల వివరాలను సిబ్బంది సేకరించనున్నారు.

    Latest articles

    Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

    అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఫార్ములా–ఈకార్‌ రేస్‌ అక్రమ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌కు...

    Rapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో...

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    More like this

    Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

    అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఫార్ములా–ఈకార్‌ రేస్‌ అక్రమ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌కు...

    Rapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో...

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...