More
    Homeజిల్లాలునిజామాబాద్​MLA Prashanth Reddy | రైతులను మోసం చేసినందుకా సంబరాలు : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

    MLA Prashanth Reddy | రైతులను మోసం చేసినందుకా సంబరాలు : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLA Prashanth Reddy | రైతు భరోసా (Rythu Bharosa) జమ చేసినందుకు కాంగ్రెస్​ సంబరాలు చేసుకోవడంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి (Vemula Prashanth Reddy) స్పందించారు. రైతుల్ని నమ్మిచ్చి మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఏం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారన్నారు.

    కేసీఆర్​ (KCR) హయాంలో 11 విడుతల్లో రూ.75,000 కోట్లు జమ చేశామన్నారు. కానీ ఏనాడు ఇంత హంగామా చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి రూ.7,500 కాకుండా రూ.5,000 ఇచ్చిందన్నారు. రెండో విడత పూర్తిగా ఎగ్గొట్టి, మూడో పంటకు 4 ఎకరాల పైన ఉన్న రైతులందరికీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు.

    READ ALSO  Bandi Sanjay | కేసీఆర్​ ఢిల్లీలో మూటలు అప్పజెప్పారు.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    కాంగ్రెస్​ ప్రభుత్వం సగం మంది రైతులకు రుణమాఫీ చేయలేదని ప్రశాంత్​ రెడ్డి అన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నాలకు అని మాటమార్చిందన్నారు. రైతు బీమా ప్రీమియం కట్టడం లేదని విమర్శించారు. కౌలు రైతులకు ఇస్తానన్న రైతుభరోసా ఇంకా అమలు చేయలేదని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్​ ప్రభుత్వం సంబరాలు ఎందుకు చేసుకుంటుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రేవంత్​రెడ్డి రైతుభరోసా జమ చేసి, సంబరాలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

    Latest articles

    Job Notification | గుడ్​న్యూస్​.. ఆ పోస్టల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల

    అక్షరటుడే, హైదరాబాద్: Job Notification : తెలంగాణలో ఖాళీగా ఉన్న డెంటల్ అసిస్టెంట్​ సర్జన్​, స్పీచ్​ పాథాజిస్ట్​ పోస్టుల...

    Cm Revanth Habbits | రేవంత్‌ మందు ముట్టరు.. సిగరెట్​ తాగరు.. ఎంపీ కొండా ఆసక్తికర వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cm Revanth Habbits : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణ యూత్‌ ఐకాన్‌ (Telangana youth...

    PADMASHALI SANGHAM | పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా చంద్రశేఖర్

    అక్షరటుడే నిజాంసాగర్: PADMASHALI SANGHAM | పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా గాజుల చంద్రశేఖర్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజాంసాగర్...

    Jagga Reddy | నెక్ట్స్​ సీఎం నేనే.. సీఎం కుర్చీపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC working president), కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

    More like this

    Job Notification | గుడ్​న్యూస్​.. ఆ పోస్టల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల

    అక్షరటుడే, హైదరాబాద్: Job Notification : తెలంగాణలో ఖాళీగా ఉన్న డెంటల్ అసిస్టెంట్​ సర్జన్​, స్పీచ్​ పాథాజిస్ట్​ పోస్టుల...

    Cm Revanth Habbits | రేవంత్‌ మందు ముట్టరు.. సిగరెట్​ తాగరు.. ఎంపీ కొండా ఆసక్తికర వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cm Revanth Habbits : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణ యూత్‌ ఐకాన్‌ (Telangana youth...

    PADMASHALI SANGHAM | పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా చంద్రశేఖర్

    అక్షరటుడే నిజాంసాగర్: PADMASHALI SANGHAM | పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా గాజుల చంద్రశేఖర్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజాంసాగర్...