అక్షరటుడే, వెబ్డెస్క్: Ceasefire Violation | భారత్ – పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించిందని కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ foreign ministry secretary vikram misry ప్రకటించారు.
సరిహద్దు పొడవునా indian borders పాక్ కాల్పుల ఒప్పందానికి ఉల్లంఘించిందన్నారు. పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోందని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్కు సూచించామన్నారు. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు సంపూర్ణ బాధ్యత పాక్తిస్తాన్దేనన్నారు. డీజీఎంవో మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అలాగే పాక్ దాడులను తిప్పి కొట్టేందుకు భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు మిస్రీ వెల్లడించారు. కాగా.. తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు సమాచారం. ఆదివారం కీలక భేటీ నిర్వహించే అవకాశం ఉంది.