అక్షరటుడే, వెబ్డెస్క్ : PCC Chief | రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ (PCC president Mahesh Kumar Goud) అన్నారు. గురువారం గాంధీ భవన్లో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ (state in-charge Meenakshi Natarajan)తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయా నియోజకవర్గ నేతలతో చర్చించారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు.
పార్టీ బలోపేతం కోసమే సమావేశంలో చర్చించినట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy) చేపట్టిన కులగణన దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణను చూసే కేంద్ర ప్రభుత్వం (central government) కూడా కుల గణన చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ మాదిరి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని పేర్కొన్నారు.
PCC Chief | యావత్ దేశం తెలంగాణ వైపు..
యావత్ దేశం మనవైపు చూసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ బలోపేతం కోసమే చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను (government programs) ప్రజలకు చేరవేయాలని సూచించారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఇటీవల మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ (Hyderabad City) చేరుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఆమె సందర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి తేవడానికే ఈ సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారం.