అక్షరటుడే, వెబ్డెస్క్ :KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (Brs Working president ktr) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyderabad Cyber Crime Police) కేసు నమోదు చేశారు.
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన సందర్భంగా కేటీఆర్ రేవంత్రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చిల్లర వ్యక్తి అన్నారు. సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Huzurabad MLA Padi Kaushik Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Congress MLC Balmuri Venkat) శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేటీఆర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఎస్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
KTR | మరోవైపు ఏసీబీ నోటీసులు
కాగా.. ఫార్ముల ఈ రేస్ కేసులో సైతం ఏసీబీ అధికారులు మరోసారి విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్ గతంలో విచారణకు హాజరయ్యారు. అయితే మళ్లీ అధికారులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.