అక్షరటుడే, వెబ్డెస్క్:Ambati Rambabu | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు(Ambati Rambabu)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. హామీలు అమలు చేయడం లేదని వైసీపీ నాయకులు(YCP Leaders) బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు కలెక్టరేట్(Guntur Collectorate)కు వచ్చిన అంబటి రాంబాబును పట్టాభిపురం సీఐ(CI) అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకున్నారు. ‘నువ్వు ఏం చేస్తావంటే.. నువ్వు ఏం చేస్తావని” మాజీ మంత్రి, సీఐ అనుకున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుపై గురువారం పోలీసులు(Police) కేసు నమోదు చేశారు. పోలీసులతో గొడవ పడినందుకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. దీంతో కేసులకు నేను భయపడాలా..? అంటూ సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్(Minister Lokesh) ను ట్యాగ్ చేస్తూ అంబటి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.