అక్షరటుడే, వెబ్డెస్క్ : Kanwar Yatra | మధ్యప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్రికులపైకి ఓ కారు దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్-శివపురి(Gwalior-Shivapuri) లింక్రోడ్లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని గ్వాలియర్ జిల్లా ఉటిల్లా ప్రాంతంలోని భదవానా సరస్సు సమీపంలో కారు భక్తులను ఢీకొంది. కన్వర్ యాత్రికులు గంగా జలంతో తిరిగి వస్తుండగా శివపురి లింక్ రోడ్డుపై వేగంగా వస్తున్న కారు వారిపైకి దూసుకెళ్లింది. అనంతరం ఆ కారు లోయలో పడిపోయింది. మంగళవారం అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డును దిగ్బందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Kanwar Yatra | కన్వర్ యాత్ర అంటే..
ఉత్తర భారత్లో కన్వర్ యాత్ర(Kanwar Yatra)కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. భక్తులు గంగా జలాన్ని కావడిలో తీసుకొచ్చి తమ ప్రాంతంలోని శివలింగానికి(Shivalingam) అభిషేకం చేస్తారు. శ్రావణ మాసం(Shravana Masam)లో ఈ యాత్ర చేపడుతారు. గంగా జలాన్ని కిలో మీటర్ల మేర కావడిలో మోసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. ఇలా అభిషేకం చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని, మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.