అక్షరటుడే, హైదరాబాద్: Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీకి New Sports Policy Telangana ఆమోదించారు. పీసీ ఘోష్ కమిషన్కు మినిట్స్తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
అలాగే.. మంత్రివర్గంలో నిర్ణయించిన మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా Rythu Bharosa విజయోత్సవ సభలు నిర్వహించనున్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ ద్వారా క్లియర్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది.