అక్షరటుడే, వెబ్డెస్క్ :Cabinet Meeting | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Cabinet Meeting | రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా..
రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడుతుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. సాగు పెట్టుబడి కోసం రైతు భరోసా(Rythu Bharosa) సకాలంలో విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఇటీవల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. త్వరలో రైతు భరోసా విడుదల చేస్తామని తెలిపారు. దీంతో ఈ సమావేశంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే యాసంగి సీజన్లో సేకరించిన సన్న రకం ధాన్యానికి బోనస్ విషయమై కూడా సమావేశంలో చర్చించి నిధులు విడుదల చేయనున్నట్లు తెలిసింది.
Cabinet Meeting | స్థానిక సంస్థల ఎన్నికలు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎంతో మంది నాయకులు నిరీక్షిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవికాలం, జూలైలో ఎంపీటీసీ(MPTC)లు, జెడ్పీటీసీ(ZPTC)ల పదవీకాలం ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడు పెడతారా అన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పలువురు మంత్రులు మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యుల్ విడుదల చేస్తామని తెలిపారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతామన్నారు. దీంతో ఈ ఎన్నికలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించి, ఎన్నికల తేదీలపై ప్రకటించే అవకాశం ఉంది.