అక్షరటుడే, వెబ్డెస్క్ : Bharat – Pak Tensions | భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో కేంద్రం అప్రమత్తమైంది. దాయాది దేశం దాడులను తిప్పి కొడుతూనే రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు cheif secretary కేంద్ర హోంశాఖ శుక్రవారం లేఖ రాసింది. ఆయా రాష్ట్రాల్లో అత్యవసర పరికరాలు కొనుగోలు చేయడానికి సివిల్ డిఫెన్స్ చట్టంలో 11వ రూల్ ఉపయోగించాలని సూచించింది. అత్యవసర పరికరాలు కొనేందుకు సీఎస్లకు అధికారం కల్పించింది.